Archive for వార్తానేత్రం

వెరవను.. రచన ఆపను… తస్లీమా నస్రీన్‌

దాడులు చేస్తే వెనుకంజ వేయబోనని, ఏదేమైనా తన అభిప్రాయాల వ్యక్తీకరణను ఆపననీ బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌ స్పష్టం చేశారు. సాధారణ ప్రజల ఆదరాభిమానాలు తనకు అండగా ఉన్నాయని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో మజ్లిస్‌ నేతల దాడికి గురైన తర్వాత ఆమె హైదరాబాద్‌ విమానాశ్రయంలోనూ, కోల్‌కతా చేరిన తర్వాత ఫోన్లోను విలేఖరులతో మాట్లాడారు. Read the rest of this entry »

Comments

తస్లీమా సంఘీభావ ప్రదర్శన

తస్లీమానస్రీన్‌పై హైదరాబాదు ప్రెస్‌క్లబ్‌లో మజ్లిస్‌ శాసనసభ్యుల నాయకత్వంలో జరిగిన అనాగరిక దాడిని నిరసిస్తూ నగరంలో శనివారం ఉదయం అరసం, విరసం, ఎపియుడబ్ల్యూజెల ఆధ్వర్యంలో ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన గుంటూరు అంబేద్కర్‌ విగ్రహం సెంటర్‌ నుండి ట్రావెలర్స్‌ బంగళా వరకు కొనసాగింది. Read the rest of this entry »

Comments

తస్లీమా నస్రీన్‌పై అనాగరిక దాడి

తస్లీమా రచించిన ‘శోధ్‌’ పుస్తకాన్ని హైదరాబాద్‌కు చెందిన రచయిత్రి వెనిగళ్ల కోమల ‘చెల్లుకు చెల్లు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీంతోపాటు మరో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేషనలిస్ట్‌ వాయిస్‌ పబ్లికేషన్‌ సంస్థ, శాస్త్రీయ పరిశీలనా కేంద్రం 09.08.2007వ తేదీ గురువారం ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ దీనికి వేదిక. Read the rest of this entry »

Comments

‘కీర్తిశేషులు’ భమిడిపాటి

ప్రముఖ సినీ రచయిత, ఆంధ్ర – ఆంగ్లభాషలలో దిట్ట, గణిత మేధావి భమిడి పాటి రాధాకృష్ణ (78సం||లు) సెప్టెంబర్‌ 4వ తేది రాజమండ్రిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు.  భమిడిపాటి 150 సినిమాలకు మాటలు, కథలు అందించారు. Read the rest of this entry »

Comments

పాత్రికేయుడు, అనువాద రచయిత సహవాసి కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, అనువాదకుడు జంపాల ఉమామహేశ్వరరావు బుధవారం 29.08.07 కన్నుమూశారు. ఆయన ‘సహవాసి’ అనే పేరుతో పాఠకలోకానికి సుపరిచితులు. Read the rest of this entry »

Comments

సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జాషువా వర్ధంతి

గుర్రం జాషువా

గుర్రం జాషువా

తెలుగు సాహిత్యలోకంలో తన కవితాశక్తితో నిలిచిన సాహితీమూర్తి అని జాషువాకు పలువురు వక్తలు నివాళులర్పించారు. గుర్రం జాషువా 36వ వర్ధంతి సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో టాంక్‌బండ్‌పై గల జాషువా విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించబడింది. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్‌ తెలకపల్లి రవి జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యానికి పూర్వమే సామాజిక స్పృహ, నిబద్ధతలతో జాషువా కవిత్వం పండించారని, Read the rest of this entry »

Comments

‘మనసు కురిసిన ముత్యాలు’ ఆవిష్కరణ సభ

మనసు కురిసిన ముత్యాలు

మనసు కురిసిన ముత్యాలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో సాహితీ సంస్థ శ్రీ నన్నయభట్టారక పీఠం ఆధ్వర్యంలో ది. 15.6.07న కవిశ్రీ మోహనప్రసాద్‌ రచించిన ‘మనసు కురిసిన ముత్యాలు’ కవితాసంపుటి గ్రంధావిష్కరణ జరిగినది. Read the rest of this entry »

Comments

కవిత్వశిల్పి ‘గుంటూరు శేషేంద్ర’

శేషేంద్ర సంస్మరణ సభ
గుంటూరు శేషేంద్ర సంస్మరణ సభలో మాట్లాడుతున్న బండి నారాయణస్వామి, ప్రక్కన రచయితలు వై. శ్రీరాములు, వి. చంద్రశేఖర శాస్త్రి, మల్లెల నరసింహమూర్తి

సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా కవిత్వాన్ని మలచిన కవిత్వశిల్పి గుంటూరు శేషేంద్రశర్మ అని, కవిత్వం మరుగున పడే సమయంలో కవిత్వపు కాంతులను వెదజల్లిన గొప్ప కవులలో ఒకరని ఎస్కేయూ తెలుగు ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. Read the rest of this entry »

Comments

డా|| మంతెన సూర్యనారాయణరాజు షష్టిపూర్తి

సాహితీమిత్రులు

సాహితీమిత్రులు

విజయవాడ చండ్ర రాజేశ్వరరావు లైబ్రరీ హాల్లో 26.08.2007న ప్రముఖ సాహిత్యవేత్త డా|| మంతెన సూర్యనారాయణరాజు షష్టిపూర్తి (మచిలీపట్నం-సాహితీమిత్రులు) మహోత్సవం సందర్భంగా డా|| మంతెన (కూర్చున్న వ్యక్తి), యన్‌. అంకమ్మరావు (డా. మంతెన సాహిత్యంపై పి.హెచ్‌డి. చేస్తున్న వ్యక్తి), సుప్రసిద్ధ రచయిత వీరాజీ, గుత్తికొండ సుబ్బారావు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, డా. రావి రంగారావు, కర్నాటి లక్ష్మీనరసయ్య గారు

Comments

నూతలపాటి కవితా సత్కారం

రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాకరమైన ‘నూతలపాటి కవితా సత్కారం 2006′కు గాను ప్రముఖకవి శ్రీ శిఖామణి, హైదరాబాదు, వచన కవితా సంపుటి ‘నల్లగేటు – నందివర్ధనం చెట్టు‘ను ఎంపిక చేశారని గంగాధర సాహితీ కుటుంబం కార్యదర్శి DA. డి.కిరణ్‌క్రాంత్‌ చౌదరి తెలియజేశారు.తమ సంస్థ ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ సాహితీ సేవ చేస్తున్నదని, అవార్డు గ్రహీతకు 2000/ -లతో బాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారని కార్యదర్శి తెలియ జేశారు.

Comments

« Previous entries Next Page » Next Page »