భూమి నవ్వింది… (సంపాదకీయం)
రాయలసీమ ప్రాంతంలో పాతతరం పెద్దలు అంటుంటారు
”నాది నీదే, నీది నీదే !
నాది నాదే, నీది నీదే !!
నీది నాదే, నాది నాదే !!!”
ఈ వాక్యాలు వర్తమాన సమాజానికి సరిగ్గా సరిపోతాయి. కొంచెం వివరంగా చెప్పాల్సి వస్తే…
రెండు తరాల క్రితం… ”అయ్యా ! ఈ భూమి మీదని తెలిసింది. నాకేమో ఏ భూమి లేదు. మీరు దయపెట్టి కొంచెం భూమి ఇస్తే సాగు చేసుకొని జీవిస్తానయ్యా” దీనంగా అడిగాడు పేదవాడు.
”దానికేం భాగ్యం ! భూమిపైన హక్కు అంటూ వుంటే ఆ దేవునికి వుంటుంది. నాకు హక్కు వుందంటే భూమి నవ్వుతుంది. నీకిష్టమున్నంత భూమి బాగు చేసుకొని బతుక్కోపో.- నాది నీదే !, నీది నీదే ” అన్నాడు పెద్దవాడు.
ఒక తరం క్రితం… ఎవరి శక్తి మేర వారు భూమిని సాగు చేసుకొని జీవిస్తున్నారు ఇద్దరు పేదలు. ఆ భూమి తమది కాదు. తమ ఇద్దరిలోనే ఎవరో ఒకరు రెండవ వ్యక్తి భూమి తీసేసుకుంటారనే అనుమానం వారిని వేధించేది. చివరికి రచ్చబండ కాడ చేరి చర్చించుకున్నారు. ఆ ఇద్దరిలో కొంచెం తెలివి గల పేదోడు ఇలా అన్నాడు ”నాది నాదే, నీది నీదే !” అన్నాడు. సాగు చేసిన ప్రకారం భూమి పంచుకొన్నారు.
ఈ తరం… ”రెండు తరాల నుంచి సాగు చేసుకొని జీవిస్తుండావా ? కాబట్టించుకోకుండ వుండినాం. కాబట్టి చెలాయించుకొన్యావ్. ఇంక ఈ భూమి… ”నీది నాదే, నాది నాదే – పా..పా.. కథలు పడితే ఖూని అయిపోతావ్ పోరా… పో.” -
ఈ వాక్యాలు ఇప్పుడు ఏ విషయానికి వర్తించవో చెప్పండి.
-శశిశ్రీ